ఆంధ్ర మహాకవులు
నన్నయ్యభట్టు - క్రీ. శ 11 వ శతాబ్దమునకు చెందినవారు.
ఆంధ్రమహాభారతమున ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వమును సగము వరకు
రచించెను. ఇతనిని ఆదికవి అని అందురు. రాజమహేంద్రవరమును పాలించిన
రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. ఆంధ్ర శబ్ద చింతామణి యను తెనుగు వ్యాకరణమును
కూడా రచించెను. .శబ్దశాసనుడని యితని బిరుదు.
తిక్కన సోమయాజి : -క్రీ. శ 13 వ శతాబ్దమునకు చెందినవారు. నన్నయ తర్వాత భారతమున
విరాట పర్వం నుంచి తుదివరకు గల 15 పర్వాలు వ్రాశారు.
ఇతని రచనలు కృతి నిర్వచనోత్తర రామాయణం.
కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడని ఇతనికి గల బిరుదులు. ఇతడు
నెల్లూరు ని పాలించిన మనుమసిద్ధి రాజు ఆస్థాన కవి.
ఎర్రాప్రగ్గడ : క్రీ. శ 13 వ శతాబ్దమునకు చెందినవారు. భారతమున నన్నయ అసంపూర్తిగా
వదిలిన అరణ్య పర్వమును పూర్తి చేసెను. మరియు నృసింహ పురాణము,
హరివంశము రచించెను. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు
అనునవి ఇతని బిరుదులు.
భారతము వ్రాసిన ఈ ముగ్గురు కవులకు కవిత్రయమని పేరు.
రచించెను. ఇతనిని ఆదికవి అని అందురు. రాజమహేంద్రవరమును పాలించిన
రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. ఆంధ్ర శబ్ద చింతామణి యను తెనుగు వ్యాకరణమును
కూడా రచించెను. .శబ్దశాసనుడని యితని బిరుదు.
తిక్కన సోమయాజి : -క్రీ. శ 13 వ శతాబ్దమునకు చెందినవారు. నన్నయ తర్వాత భారతమున
విరాట పర్వం నుంచి తుదివరకు గల 15 పర్వాలు వ్రాశారు.
ఇతని రచనలు కృతి నిర్వచనోత్తర రామాయణం.
కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడని ఇతనికి గల బిరుదులు. ఇతడు
నెల్లూరు ని పాలించిన మనుమసిద్ధి రాజు ఆస్థాన కవి.
ఎర్రాప్రగ్గడ : క్రీ. శ 13 వ శతాబ్దమునకు చెందినవారు. భారతమున నన్నయ అసంపూర్తిగా
వదిలిన అరణ్య పర్వమును పూర్తి చేసెను. మరియు నృసింహ పురాణము,
హరివంశము రచించెను. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు
అనునవి ఇతని బిరుదులు.
భారతము వ్రాసిన ఈ ముగ్గురు కవులకు కవిత్రయమని పేరు.
No comments:
Post a Comment