వేమన పద్యం - కసువు తినును గాదె పసరంబు లెప్పుడు (మూర్ఖపద్ధతి)
కసువు తినును గాదె పసరంబు లెప్పుడు
చెప్పినట్లు వినుచుఁ జేయుఁ బనులు,
వానిసాటియైన మానవుఁ డొప్పడా?
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: పశువులు గడ్డి తినుచున్నను యజమానుడు చెప్పినట్లు వినుచు పనులు చేయును. మూర్ఖుడట్లు చేయడు. అతడు పశువుకంటె హీనుడు.
No comments:
Post a Comment